preity zinta: రూపాయి బిళ్ల‌ నా జీవితాన్ని మార్చేసింది: ప్రీతిజింటా

preity zinta: ప్రీతిజింటా పేరు గుర్తుంది క‌దా.. అదేనండీ.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజ‌కుమారుడు లో హీరోయిన్‌గా ప్రీతిజింటా చేసింది క‌దా.. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ప్రేమ‌తో రా చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది preity zinta ప్రీతిజింటా. అనంత‌రం బాలీవుడ్‌లో అడుగుపెట్టి ప‌లు చిత్రాల్లో న‌టించి అక్క‌డ ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించింది.

Preity zinta

అయితే ఆమె న‌ట‌న‌కు ముందుగా గుర్తొచ్చేది.. ఆమె సొట్ట బుగ్గ‌లకు ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అందానికి అద్భుత‌మైన అభిన‌యాన్ని జోడించి బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది preity zinta ప్రీతి జింటా. అయితే అస‌లు తాను సినిమాల్లోకి రావ‌డానికి కార‌ణం ఒక్క రూపాయి బిళ్ల‌నే అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. జ‌న‌వ‌రి 31న ప్రీతిజింటా బ‌ర్త్‌డే జ‌ర‌గ‌గా.. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. అప్ప‌టి టాప్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ త‌న‌ను చూసి త‌ర ర‌మ్ ప‌మ్ సినిమా కోసం అడిగాడు.. అయితే నాకు కెరీర్ ప‌ట్ల అప్ప‌టికి పెద్ద ఆలోచ‌న లేదు. కానీ విధి నిర్ణ‌యం ఎలా ఉంటే అలా చేస్తాన‌ని ఆ ద‌ర్శ‌కుడితో చెప్పాను. అలాగే ఆయ‌న ఎదురుగానే రూపాయి బిళ్ల‌ను ఎగుర‌వేశాను. బొమ్మ ప‌డితే యాక్టింగ్ చేస్తాను. బొరుసు ప‌డితే సినిమాల్లోకి రాను అని అనుకున్నా. బొమ్మ ప‌డింది.. సినిమా అంగీక‌రించాను అనిpreity zinta ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన కొన్నాళ్ల త‌ర్వాత ఆగిపోయింది. ఆ త‌ర్వాత మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన దిల్‌సే చిత్రంలో షారుఖ్‌ఖాన్ జోడీగా ప్రీతిజింటా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పాలైన.. మ‌ణిర‌త్నం, షారుఖ్‌, ప్రీతిజింటాల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. దీని త‌ర్వాత మ‌ళ్లీ సెట్స్‌పైకి త‌ర ర‌మ్ ప‌మ్ చిత్రం సెట్స్‌పైకి మ‌ళ్లీ వ‌చ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయి ప్రేక్ష‌కుల‌కు ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు. అది కూడా విధి నిర్ణ‌య‌మే కావ‌చ్చు అంటోంది ప్రీతి. ఈ విధంగా రూపాయి బిళ్ల త‌న లైఫ్ ఇలా మారింద‌‌ని తెలిపిందిpreity zinta.