సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ ‘ప్రణవం’ ఊర్వశి ఓటిటి విడుదల!!

తన భార్యను హత్య చేశాడనే అభియోగంపై అరెస్టైన ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడా… లేక కటకటాలపాలయ్యాడా అనే ఇతివృత్తంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రణవం’.
‘ఈరోజుల్లో’ ఫేమ్ శ్రీమంగం, అవంతిక, హరి నల్వా, దొరబాబు, జెమినీ సురేష్, జబర్దస్త్ బాబీ ముఖ్య తారాగణంగా.. ‘చరిత & గౌతమ్ ప్రొడక్షన్’ పతాకంపై కుమార్.జి దర్శకత్వంలో తనూజ సోంపల్లి నిర్మించిన ఈ చిత్రం ఊర్వశి ఓటిటి ప్రేక్షకులను ఈనెల 7 నుంచి అలరించనుంది.
హీరో శ్రీ మంగం మాట్లాడుతూ.. ‘ఓటిటి ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ‘ప్రణవం’. మర్డర్ బ్యాక్ డ్రాప్ లో చాలా ఆసక్తికరంగా సాగే ఈ చిత్రంలో సస్పెన్స్ తోపాటు… సెంటిమెంట్, ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారికి మా ‘ప్రణవం’ చిత్రాన్ని చేరువ చేస్తున్న ‘ఊర్వశి ఓటిటి’ వారికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం” అన్నారు!!