ప్రిడిక్షన్ చెప్పే వ్యక్తిగా ప్రభాస్?

బాహుబ‌లి, సాహో చిత్రాలు ప్ర‌భాస్‌ను ఇండియ‌న్ స్టార్‌గా నిల‌బెట్టిన సినిమాలు. ఇప్పుడు ప్ర‌భాస్ స్పీడ్ పెంచుతూ తన నెక్స్ట్ సినిమా జాన్‌ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్‌ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా ఇప్ప‌టికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది, గతంలో వచ్చిన షెడ్యూల్ గ్యాప్ ని అలానే ఉంచి ఫ్రెష్ గా షూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి జాన్ సినిమాకి సంబంధించిన అన్ని పనులని పకడ్బందీగా చేస్తున్నారు.

ప్రభాస్ యూరోప్ నుంచి బయటికి రాగానే జాన్ లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అయితే జాన్ గురించి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చెప్పిన నెరేష‌న్ న‌చ్చ‌డంతో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తాన‌ని, వారం రోజుల్లో డేట్స్ అడ్జస్ట్ చేసి జాన్ సినిమాకి అవసరమైన డేట్స్ కేటాయిస్తానని చెప్పారట. గత కొంతకాలంగా అన్ని భాషల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న జగ్గు భాయ్, జాన్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం మంచి విషయం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ ప్రిడిక్షన్ తెలిసిన వ్యక్తి పాత్రలో కనిపించనుండగా, పూజ హెగ్డే పూజా హెగ్డే టీచ‌ర్‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. గోపి కృష్ణ బ్యానర్ నిర్మిస్తున్న జాన్ సినిమా కోసం యూరోప్ సెట్ ని హైదరాబాద్ లో వేయనున్నారు.