అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మిడియాకు చాలా దూరంగా ఉంటాడని అందరికి తెలిసిన విషయమే అయితే ఆయన ఎలాంటి పోస్ట్ చేసినా కూడా అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇక నేటితో సాహో సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభాస్ అలా స్పెషల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.

బాహుబలి అనంతరం భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా సాహో. దాదాపు 350కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా దేశవ్యాప్తంగా అత్యదిక కేంద్రాలలో విడుదలయ్యింది. అయితే నార్త్ లో సక్సెస్ అయినంతగా సౌత్ లో క్లిక్కవ్వలేకపోయింది. కానీ ఆ సినిమా అంటే ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. అందుకే వాళ్లకు స్పెషల్ గా థ్యాంక్స్ చెబుతూ తనకు సపోర్ట్ చేసిన చిత్ర యూనిట్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను చేయనున్న ప్రభాస్ అలాగే ఓం రావత్ డైరెక్షన్ లో ఆది పురుష్ సినిమాను పూర్తి చేయనున్నాడు.