మరో పాన్ ఇండియా దర్శకుడితో ప్రభాస్ థ్రిల్లర్ మూవీ?

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం గ్యాప్ లేకుండా పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ప్రభాస్ సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో దర్శకులు కూడా ప్రభాస్ వద్దకు అలాంటి కథలే తీసుకువెళుతున్నారు. ఇక ప్రస్తుతం ఒక కన్నడ దర్శకుడు మాత్రం ప్రభాస్ కోసం ఒక థ్రిల్లర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు. KGF సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ దర్శకుడు KGF 2ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్ తో మరో సినిమాని చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇంకా ఎన్టీఆర్ అయితే ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ప్రభాస్ కోసం కూడా ప్రశాంత్ ఒక థ్రిల్లర్ కథను రెడీ చేస్తున్నట్లు టాక్. రాధేశ్యామ్ అనంతరం నాగ్ అశ్విన్ సినిమాతో బిజీ కానున్న ప్రభాస్ ఆ రెండు సినిమాల తరువాత ప్రశాంత్ తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.