Tollywood: జాతిర‌త్నాలు కాదు నిజంగానే కోతిరత్నాలు.. ప్ర‌భాస్‌తో ఎంజాయ్ చేసిన మూవీ టీం!

Tollywood: టాలీవుడ్ ప్ర‌తిభావంత‌మైన న‌టుడు న‌వీన్ పోలిశెట్టి ‌ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే.. కాగా న‌వీన్ పోలీశెట్టి న‌టించిన తాజా చిత్రం జాతిర‌త్నాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రంలో న‌వీన్‌తో పాటు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లుగా చేశారు. అలాగే ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించ‌గా.. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, మహా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Prabhas

దీంతో Tollywoodఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను ఓ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేశారు చిత్ర‌బృందం. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో రిలీజ్ చేయిస్తున్న‌ట్లు రెండ్రోజుల క్రితం ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో జాతి ర‌త్నాలు టీమ్‌.. జాతిర‌త్నాలు- జోగిపేట్ టు బాంబే పేరుతో వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అస‌లు ఈ వీడియోలో న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, హీరోయిన్ ఫ‌రియా, డైరెక్ట‌ర్ బాహుబ‌లి ప్ర‌భాస్‌తో సంద‌డి సంద‌డి చేశారు. చెప్పిన విధంగానే ప్ర‌భాస్‌తో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని, ఈ చిన్న వీడియోతోనే ప‌దిసార్లు న‌వ్వాన‌ని.. ఇంకా సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతుంద‌ని Tollywoodచిత్ర‌బృందాన్ని అభినందించాడు. ఇక ప్ర‌భాస్‌తో న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, హీరోయిన్ ఫ‌రియా, డైరెక్ట‌ర్ అనుదీప్ ఎంతో ఫ‌న్నీగా గ‌డిపారు.. మ‌రీ ముఖ్యంగా న‌వీన్‌, ప్రియ‌ద‌ర్శి అయితే వాళ్ల సంభాష‌ణ‌ల‌తో ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో న‌వ్వులు పూయించేలా చేశారు. ఇక జాతి ర‌త్నాలు ట్రైల‌ర్ ఈ రోజు సాయంత్రం 4.20నిమిషాల‌కు అందుబాటులోకి రానుంద‌ని Tollywoodచిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.