ప్రభాస్ సంచలన రికార్డు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన రికార్డు సృష్టించాడు. బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో టాలీవుడ్ నుంచి ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకున్న ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోని టాప్ డైరెక్టర్లు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా.. దీని తర్వాత ఆదిపురుష్, సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

PRABHS

ఈ నాలుగు సినిమాల బడ్జెట్ మొత్తం కలిపితే రూ.1500 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకు రూ.300 కోట్ల బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఇదిపురుష్ సినిమాను రూ.500 కోట్లపైనే బడ్జెట్‌తో రూపొందించనున్నారని టాక్. ఇక నాగ్ అశ్విన్ సినిమాను రూ.450 కోట్లకు పైగా ఖర్చుతో తీయనున్నారని టాక్. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రానున్న సలార్ సినిమాను కూడా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం, బాలీవుడ్ నటీనటీలు ఈ సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. ఇందులో సీత పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్‌నే తీసుకోనున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు చాలామంది ఈ సినిమా కోసం పనిచేయనున్నారు. ఇక నాగ్ అశ్విన్ తీయనున్న సినిమాలో బిగ్‌బి అబితాబ్ కీలక పాత్రలో నటించనుండగా.. ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకొణే నటించనుంది. ఈ సినిమాలన్నీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్నాయి.