ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా నుంచి మరో అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రానున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతుండగా… తాజాగా మేకర్స్ ఈ సినిమాకి పనిచేయనున్న ఇద్దరు టెక్నీషియన్ల పేర్లను ప్రకటించారు.

PRABAHS AND NAGASWIN UPDATE

మ్యూజిక్ డైరెక్టర్, DOP పేర్లను సినిమా యూనిట్ ప్రకటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించనుండగా.. శాంచెజ్-లోపేజ్‌ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరు మహానటి సినిమాకు పనిచేశారు. దీంతో వెల్ కమ్ బ్యాక్ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. మహానటి సినిమాకి పనిచేసిన టెక్నీషీయన్లను ప్రభాస్ సినిమాకి తీసుకోవడం గమనార్హం. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కనిపించనుంది. ఇక బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు.