నన్ను దారుణంగా కొట్టడు.. హత్య చేయబోయాడు

భర్త సామ్ బాంబేపై పూనమ్ పాండే ఇటీవల అత్యాచారం, హింస, దాడి చేసినట్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతను కొట్టిన తరువాత మెదడు రక్తస్రావం జరిగిందని వెబ్ మీడియాకు తెలిపింది. వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరానని, ఇటీవల డిశ్చార్జ్ అయ్యానని కూడా ఆమె చెప్పారు. నన్ను ఈసారి చాలా ఘోరంగా కొట్టాడు, దాదాపు హత్య చేసేవరకు వచ్చాడు. నేను ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉన్నానో నాకె తెలియదు.

అతను నా ముందు నార్మల్ గా ఏడుస్తుంటాడు. మరియు నాకు ఏమి చేయాలో తెలియదు? ప్రతిసారీ అతను నన్ను కొట్టిన తరువాత క్షమించండి అని ఏడుపు ప్రారంభిస్తాడు. ఈసారి కూడా అతను అదే చేసాడు. అది మరలా జరగదని ప్రతిసారి వాగ్దానం చేస్తాడు. బావుంటానని నమ్మిస్తాడు. కానీ అతను మళ్ళీ అలానే చేస్తుంటాడు. అతని వల్ల నాకు మెదడు రక్తస్రావం వచ్చింది. డబ్బు కోసం సామ్‌ను వివాహం చేసుకున్న ఆరోపణల్లో నిజం లేదు. నా వీడియోలు ద్వారానే ఇంకా అతను డబ్బులు సంపాదిస్తున్నాడు. అంతే గాని నేను డబ్బుల కోసం చేసుకోలేదు. అతను ఒక మూర్ఖుడని అనుకుంటున్నాను.. అని పూనమ్ వివరణ ఇచ్చింది