టాలీవుడ్ యంగ్ హీరోకు పోలీసుల నోటీసులు

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ దుద్దుంపూడికి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తక్కువ ధరకే కారు ఇప్పిస్తానంటూ తనను మోసం చేశాడంటూ ఒక వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో విశ్వంత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు.

police notices to viswant

విశ్వంత్‌తో పాటు అతడి తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా, స్పేస్ టైమ్ ఇంటీరియర్ నిర్వాహకులు ఆత్మకూరి ఆకాశ్‌గౌడ్‌లకు కూడా నోటీసులు పంపారు. దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విశ్వంత్.. గత ఏడాది విడుదలైన ఓ పిట్టకథ సినిమాతో నటించారు.