Web series: పిట్ట‌క‌థ‌లు ట్రైల‌ర్ రిలీజ్‌.. మ‌రీ బోల్డ్‌గా శ్రుతి, అమ‌లాపాల్

Web series: ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అంథాలజీ సిరీస్ పిట్ట‌క‌థ‌లు. ఈ సిరీస్‌లోని నాలుగు స్టోరీల‌ను న‌లుగురు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు తెర‌కెక్కించారు. నాగ్ అశ్విన్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, నందిని రెడ్డి, సంక‌ల్ప్‌రెడ్డి ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. అయితే బాలీవుడ్‌లో ప్రేక్షాకాద‌ర‌ణ పొందిన ల‌స్ట్‌స్టోరీస్ సిరీస్‌కు ఇది తెలుగులో పిట్ట‌క‌థ‌లుగా తెర‌కెక్కుతుండ‌గా.. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది.

Pittakathalu trailer

ఆమె మ‌న‌సులో మాట అత‌నికి తెలుసా? తెలీదా? తెలిసి తెలియ‌న‌ట్టు న‌టిస్తున్నాడా? అంటూ ప్రారంభ‌మైన ట్రైల‌ర్ అల‌రిస్తుంది. Web series: ఇందులో శ్రుతిహాస‌న్‌, అమ‌లాపాల్‌, ఈషారెబ్బా, మంచుల‌క్ష్మీ, సాన్వే మేఘ‌న‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఈ సిరీస్‌లో అమ‌లాపాల్‌, శ్రుతిహాస‌న్ ల బోల్డ్ స‌న్నివేశాలు ఉన్న‌ట్టు చూపిస్తుంది ఈ ట్రైల‌ర్‌. ఈ సిరీస్‌లో భిన్న‌మైన సంస్కృతుల్ని ఆవిష్క‌రిస్తూ.. మ‌హిళా సాధికార‌త‌ను వారు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్ని చూపించ‌బోతున్నారు. ఆధునిక స్వ‌తంత్ర భావాలు క‌లిగిన మ‌హిళ‌ల గురించి తెలియ‌జేయ‌డానికి Web series ఈ సిరీస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 19నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతుంది.