Tollywood: “పీన‌ట్ డైమండ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్ట‌ర్ మారుతి..

Tollywood: వెర్సటైల్ యాక్టర్ అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న చిత్రం పీన‌ట్ డైమండ్‌. ఈ చిత్రంలో చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా న‌టిస్తుండ‌గా.. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై నవ దర్శకుడు వెంక‌టేష్ త్రిపర్ణ ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రం “పీన‌ట్ డైమండ్. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హిట్ చిత్రాల దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా Tollywood డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ..

‘ డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. నాతోపాటు మా బ్యానర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా వుందనిపించింది. పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్ గా క్యూరియసిటీగా ఉంది. కథ లైన్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని. అలాంటి జోనర్లో సినిమా అంటే జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అప్పుడే మనం అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని.. కోరుకుంటున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అని మారుతి అన్నారు. అలాగే Tollywood నిర్మాత‌లు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ.. ‘ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా “పీనట్ డైమండ్” చిత్రం ఉంటుంది. ఇప్పటివరకూ రాని ఓ సరికొత్త పాయింట్ ఇది. రెండు కాల‌మానాలకి సంబంధించిన ఒక వైవిధ్యమైన క‌థాంశంతో ఆడియెన్స్ కి నచ్చేలా ఈ సినిమాని వెంకటేష్ తెరకెక్కించాడు. 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే.. దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతూ ఉంటుంది. ఆ రెండు క‌థ‌ల‌కి సంబందం ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది. అనేది మెయిన్ పాయింట్. “పీన‌ట్ డైమండ్” టైటిల్ ఎందు‌కు పెట్టాం? అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. డెఫినెట్ గా ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా సినిమా ఉంటుంది. అలాగే హైదరాబాద్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, వైజాగ్ లలో షూటింగ్ జరిపామ‌ని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. త్వ‌రలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామ‌ని అన్నారు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియా స్వ‌రాలు అందిస్తున్నారు.