అనురాగ్ కశ్యప్ కి మరో షాక్ ఇచ్చిన పాయల్ ఘోష్.. లైడిటెక్టర్ పరీక్షలు

గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న పాయల్ ఘోష్, అనురాగ్ కశ్యప్ వివాదం మరో కీలక మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. పాయల్ చేసిన లైంగిక ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పోలీసులకు ఒక వివరణ ఇచ్చిన అనురాగ్ కొన్ని ఆధారాలను కూడా వారి ముందు ఉంచినట్టు లాయర్ ప్రకటన ద్వారా తెలియజేశారు. పాయల్ పై నేను దాడి చేశానని ఒక డేట్ చెప్పింది. అప్పుడు తాను శ్రీలంకలో ఉన్నట్లు పాయల్ అనురాగ్ తెలిపారు.

అయితే పాయల్ మాత్రం అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలను కొట్టిపరేస్తు సోషల్ మీడియాలో ద్వారా మరో షాక్ ఇచ్చింది. అతను ప్రవేశపెట్టిన ఆధారాలన్ని కూడా అబద్ధమని అనురాగ్ కి నార్కోటిక్ అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించేలా తన లాయర్ ద్వారా పిటిషన్ వేయబోతున్నట్లు తెలిపింది. దీంతో కేసు మరో యూ టర్న్ తీసుకునేలా ఉందని టాక్ వస్తోంది. మరోవైపు అనురాగ్ కి హీరోయిన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ఆయనతో ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న కొంతమంది నటీమణులు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.