ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై గెలిచిన టీంఇండియాపై ప‌వ‌ర్‌స్టార్‌ ప్ర‌శంస‌లు

ఆస్ట్రేలియా గడ్డ‌పై టీంఇండియా భారీ విజ‌యం సాధించింది. త‌మ అడ్డా అని గ‌ర్వంగా చెప్పుకునే గ‌బ్బాలో ఆస్ట్రేలియాకు ఓట‌మి రుచి చూపించి.. భార‌త్ స‌త్తాని మ‌రోసారి చాటి చెప్పారు. అందుకే టీమిండియాకు ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. దిగ్గ‌జాల నుంచి అభిమానుల వ‌ర‌కు భార‌త క్రికెట్ జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భార‌త యువ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై సిరీస్ గెల‌వ‌డం చారిత్రాత్మ‌క‌మ‌ని..

pawan

బ్రిస్బేన్‌లో భార‌త జ‌ట్టు విజ‌యం ఓ అద్భుత‌మ‌ని కొనియాడారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు ప‌వ‌న్‌. మ‌న క్రికెట్ జ‌ట్టుకు నా త‌ర‌పున‌, జ‌న‌సేన పార్టీ త‌ర‌పున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా.. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సాధించిన ఈ విజ‌యం యువ క్రీడాకారుల‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది. కీల‌క ఆట‌గాళ్లు గాయాల పాలైనా.. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్ర‌తిభ‌, క‌లిసి క‌ట్టుగా విజ‌యం కోసం పోరాడిన విధానం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ప‌వ‌న్‌క‌ళ్యాన్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఇక గబ్బాలో విజ‌యంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫిని కైవ‌సం చేసుకుంది భార‌త జ‌ట్టు. దీంతో సోష‌ల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఈ గెలుపు భార‌త్‌కు ఎంతో చారిత్రాత్మ‌క‌మైందని అంటున్నారు.