షర్మిల కొత్త పార్టీపై పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిన్న ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌ను పవన్ కలిసిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, ఏపీ సమస్యలపై హోంమంత్రితో పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

PAWAN ON SHARMILA PARTY

ఈ సందర్భంగా షర్మిల కొత్త పార్టీపై పవన్‌ను మీడియా ప్రశ్నించడంతో.. పవన్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని, అందరికీ హక్కు ఉందని పవన్ వ్యాఖ్యానించారు. కొత్త వాళ్లు రాజకీయాల్లో రావాలని తాను కోరుకుంటానని, ఆమె ఇంకా పార్టీని ఫామ్ చేయలేదన్నారు. పార్టీని స్థాపించి వారి విధివిధానాలు తెలియచేసినప్పుడ తాను మరింత స్పందిస్తానని పవన్ చెప్పారు.