అయోధ్య రామ మందిర నిర్మాణానికి పవన్ నిర్మాతలు భారీ విరాళం

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చిత్రాలు నిర్మిస్తున్న అయిదుగురు నిర్మాతలు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూరి విరాళం చేశారు. శ్రీ ఎ.ఎం.రత్నం (మెగా సూర్య ప్రొడక్షన్స్), శ్రీ ఎస్. రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్), శ్రీ నవీన్ ఎర్నేని (మైత్రి మూవీ మేకర్స్), శ్రీ బండ్ల గణేష్ (పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్) కలసి రూ.54.51 లక్షల విరాళాన్ని అయోధ్య రామ మందిరం కోసం ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ ఇప్పటికే రూ.30 లక్షలు విరాళాన్ని చెక్కు రూపంలో తిరుపతిలో అందించిన విషయం విదితమే.

pawan producers

ఆ స్ఫూర్తితోనే నిర్మాతలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నిర్మాతలు- ఆర్.ఎస్.ఎస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్ జీ గారికి చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ బాఘ్ సంఘ్ చాలక్ డా. వేదప్రకాష్, నిర్మాత శ్రీ ఎ.దయాకర్ రావు పాల్గొన్నారు.