JanaSena: జనసైనికుడు కుటుంబానికి జనసేన భారీ ఆర్థికసాయం

JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన జనసైనికుడు కుటుంబానికి అండగా నిలిచారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అవమానాన్ని జీర్ణించుకోలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన జనసైనికుడు కీ.శే. వెంగయ్యనాయుడు కుటుంబానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం చేశారు. ఆయన కుటుంబానికి రూ.8 లక్షల 50 వేల ఆర్థిక సహాయం చేశారు. జనసేన పార్టీ తరపున ఈ విరాళాన్ని ఆయన కుటుంబానికి తాజాగా అందజేశారు.

PAWAN HELP VENGAYYA

అంతేకాకుండా వెంగయ్య నాయుడు పిల్లల చదువుల బాధ్యతలను తానే తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. అనంతరం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఒంగోలుకు చేరుకున్నారు. అనంతరం ఇవాళ వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహార్, జనసేన నాయకులు పాల్గొన్నారు. వెంగయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పవన్ డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి పవన్ ఫిర్యాదు చేసే అవకాశముంది.