సైరా దర్శకుడికి ‘పవన్ కళ్యాణ్’ గ్రీన్ సిగ్నల్.. కథ సెట్ చేస్తున్న సీనియర్ రైటర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడో వస్తుందో గాని ఆయన గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఇక త్వరలోనే మరో రెండు సినిమాలను ఓకే చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఇక సైరా దర్శకుడికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కిక్, రేసుగుర్రం, టెంపర్ వంటి బాక్సాఫీస్ కథలను అందించిన వక్కంతం వంశీ మరోసారి సురేందర్ రెడ్డి సినిమా కోసం కథను రాయబోతున్నాడు. అందులోను పవన్ కళ్యాణ్ హీరో కావడంతో మొదటిసారి కలిసి పని చేయబోతున్న ఈ కాంబినేషన్ పై అంచనాలు తప్పకుండా భారీ స్థాయిలో పెరుగుతాయని చెప్పవచ్చు. వకీల్ సాబ్ అనంతరం క్రిష్, హరీష్ శంకర్ వంటి స్టార్ దర్శకులతో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాల అనంతరం పవన్ సురేందర్ సినిమా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.