పవన్, రాంచరణ్ మల్టీస్టారర్ మూవీ?

పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమా రానుందా?.. అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో కూడా చిరు, రాంచరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్, రాంచరణ్ కాంబోలో మూవీ వస్తుందంటే.. అది మెగా అభిమానులకే పండుగే అని చెప్పవచ్చు.

pawan and ramcharan

ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా.. దీని షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. దీని తర్వాత వచ్చే నెలలో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో పవన్ నటించనున్నాడు. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్‌లో ఒక సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా పవన్ చేయనున్నాడు.

ఈ సినిమాల తర్వాత పవన్, రాంచరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా రానుందట. కొరియగ్రాఫర్ జానీ మాస్టర్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. గత కొంతకాలంగా డైరెక్టర్‌గా మారేందుకు జానీ మాస్టర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో జానీ మాస్టర్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు పవన్ ఓకే చెప్పాడని సమాచారం. ఇక రాంచరణ్‌కు కూడా కథ నచ్చిందని, స్వయంగా రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తాడని ప్రచారం జరుగుతోంది. చాలామంది కొరియగ్రాఫర్లు డైరెక్టర్‌గా మారి సక్సెస్ అయ్యారు. మరి జానీ మాస్టర్‌కు అదృష్టం కలిసోస్తుందో.. లేదో చూడాలి.