Tollywood: ప‌వ‌ర్‌స్టార్‌- క్రిష్ కాంబో మూవీ స‌రికొత్త అప్‌డేట్‌..

Tollywood: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి కాంబినేష‌న్‌లో పీఎస్‌పీకే27 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న చిత్రానికి ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఏమ్‌.ర‌త్నం నిర్మిస్తున్నాడు. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ రాంపాల్ ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

pavan krish update

కాగా ఈTollywood చిత్రానికి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, విరూపాక్ష అనే టైటిల్స్ విన‌బ‌డుతున్నాయి.. కానీ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుగా ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్టు తెలుస్తోంది. ఇక రేపు మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఈ సినిమాకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్‌ను తెలిపారు క్రిష్‌. ఈ మేర‌కు క్రిష్ అధికారికంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలుపుతూ.. ప్రిపేరింగ్ ఫ‌ర్ టుమారో అంటూ పేర్కొన్నారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌ల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ స్వ‌రాలు అందిస్తున్నారు.