నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం “

నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం “
గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించి విడుదలై ఘన విజయం సాధించి నేటికిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం పసివాడి ప్రాణం. అదే టైటిల్ తో మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వినూత్న మైన టెక్నాలజీ తో ధన్ శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన హీరో అల్లు వంశీ, దక్షణాది తార ఇతి ఆచార్య హీరో హీరోయిన్లుగా , NS మూర్తి దర్శక , నిర్మాతగా మరో చిత్రాన్ని నిర్మిచి ఈ మధ్యకాలం లోనే సెన్సార్ పూర్తి చేసుకొని నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ముస్తాబైంది .. ఈ సందర్బంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు వైజాగ్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వయించారు.


కార్యక్రమంలో చిత్ర దర్శక, నిర్మాత NS మూర్తి మాట్లాడుతూ టాలీవుడ్లో ఇంతవరకు రానటువంటి వినూత్నమైన ” లైవ్ కం యానిమేషన్ ” చిత్రం ఇది. మోషన్ కాప్చర్ , యానిమేషన్ , గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3D Teddy Bear మరియు 2D బేబీ కేరెక్టర్స్, మిగిలిన నటీనటులతో పోటీగా ప్రేక్షకులను మెప్పించడం ఈ సినిమా ప్రత్యేకతగా చెప్పు కోవాలన్నారు.. అప్పటి పసివాడి ప్రాణం సినిమాలో పసివాడుగా నటించిన సుజిత గారు నేడు బుల్లితెర వదినమ్మగా బిజీగా ఉన్నప్పటికీ కథ నచ్చి మా సినిమాలో అతిముఖ్యమైన తల్లి పాత్రలో నటించారని తెలిపారు. నేను మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి కథకు కరెక్ట్ గా సరిపోతుందని ఆ టైటిల్ పెట్టానని, నాకు స్వతహాగా అల్లు రామలింగయ్య ఫామిలీ అంటే బాగా ఇష్టం కాబట్టి అల్లు ఫ్యామిలీ నుంచి వంశీ ని హీరోగా పరిచయం చేశానని తెలిపారు. హీరో అల్లు వంశీ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన NS మూర్తి గారికి రుణపడిఉంటానని, మూర్తి గారికి యానిమేషన్ లో అనుభవం ఉండటంతో షాట్స్ చాలా అద్భుతంగా వచ్చేలా శ్రద్ధ తీసుకున్నారని,ఈ సినిమాను ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని నమ్ముతున్నానని తెలిపారు. హీరోయిన్ ఇతి ఆచార్య మాట్లాడుతూ తెలుగులో నాకిది మొదటి సినిమా అని , డైరెక్టర్ గారు సినిమా బాగా తీశారని, సక్సెస్ అవుతుందని తెలిపారు.
ఇంకా సాయి, యోగి, రుబినా , FM బాబాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు కెమెరా : కె.బుజ్జి, మ్యూజిక్ : GJ కార్తికేయన్ , కొరియోగ్రఫీ : చార్లీ, ఫైట్స్ : కుంగ్ ఫు శేఖర్, ఎడిటింగ్ : ప్రసన్న , స్టోరీ-స్క్రీన్ ప్లే -డైరెక్షన్ : NS మూర్తి