భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు

భగీరధకు సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన “మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ ” అన్న పుస్తకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి ఆవిష్కరించారు . దుబాయ్ లోని గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్లో కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహానటుడు ఎన్ .టి రామారావు, అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు త శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్ధ సారథి, మహానటుడు ,ప్రజాయా నాయకుడు ఎన్ .టి .ఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు , రెండవ కాపీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు అందించారు .
నందమూరి తారక రామారావు గారు ఘంటసాల వెంకటేశ్వర రావు ఇద్దరూ యుగ పురుషుల ని, తెలుగు వారందరికీ వారు గర్వకారణం, దుబాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఎన్ .టి .రామారావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు .ఈ సందర్భగా పుస్తక రచయిత భగీరథ ను ఆయన అభినందించారు .
కళ , కలయిక ఫౌండేషన్ తరుపున పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ , నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ భగీరధకు ఎన్ .టి .ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు ను ప్రదానం చేశారు .
ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ మహానటుడు రామారావు శత జయంతి సందర్భంగా తాను రచించిన “మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ ” పుస్తకం తొలి ముద్రణను రామారావు గారి కుమార్తెలు లోకేశ్వరి ,పురందేశ్వరి హైదరాబాద్ లో ఆవిష్కరించారని , రెండవ ముద్రణను ఎన్నికల ముఖ్య అధికారి పార్ధ సారధి దుబాయ్ లో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు . కళ పత్రిక సంపాదకుడు మహమ్మద్ రఫీ, కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ కు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు .