ఎవరూ చూడలేదు కానీ మాస్టారు.. పెద్ద ట్వీటే ఇది…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన సంధర్భంగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఆర్ ఆర్ ఆర్ నుంచి ఒక పోస్టర్, కొరటాల శివ టీమ్ నుంచి ఒక పోస్ట్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చాయి.ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నందమూరి అభిమానులని ఫుల్ హ్యాపీ చేశాయి. ఈ మూడు సినిమాల అప్డేట్స్ తో ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ ఒక ఇంపార్టెంట్ ట్వీట్ ని పట్టించుకోకుండా వదిలేశారు. అదేంటి అంటే, ఉప్పెన మూవీతో గ్రాండ్ డైరెక్టోరల్ డెబ్యూ ఇచ్చిన బుచ్చి బాబు సన ట్వీట్. తారక్ బర్త్ డే సంధర్భంగా “ఒక లోకల్ కథని గ్లోబల్ గా చెప్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేద్దాం. వెయిటింగ్ సర్ అంటూ” బుచ్చిబాబు ట్వీట్ చేశాడు.

ఉప్పెన తర్వాత బుచ్చిబాబుకి చాలా అవకాశాలు వచ్చాయి కానీ అతను మాత్రం ఎన్టీఆర్ కోసం ఒక కథని రెడీ చేసి లైన్ వినిపించాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుందని చాలా మంది అనుకున్నారు కానీ ఎటువంటి ప్రకటనా లేదు. ఇక బుచ్చిబాబు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉండదేమో అనే అనుమానాలు వచ్చే టైంలో బుచ్చిబాబు చేసిన ట్వీట్ ప్రాజెక్ట్ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చింది. It may get delayed but its on cards for sure… Congrats Buchhi Babu, make it more big this time.