ఒక్క ట్వీట్ తో ఫ్యాన్స్ ఇంప్రెస్

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేశ్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పేరుని మెన్షన్ చేస్తూ నేషనల్ మీడియా ఛానెల్ టైమ్స్ నౌ కథనాలు ప్రసారం చేసింది. డ్రగ్స్ కేసులో నమ్రత పేరు బయటకి రావడంతో టాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. విషయం బయటకి వచ్చిన వెంటనే ఇదంతా అసత్యప్రచారమని కావాలనే తమపై బురదజల్లుతున్నారని నమ్రత టీమ్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ విషయంలో నమ్రతని సపోర్ట్ చేస్తూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ లో నమ్రత ఫోటో పెట్టిన బండ్ల గణేష్ ‘నాకు ఆమె 15 సంవత్సరాలుగా తెలుసు . ఆమె ఎంతో మందికి స్ఫూర్తినింపిన మహిళా, నమ్రత ఓ గొప్ప భార్య , గొప్ప తల్లి. నేను నమ్రతను గౌరవిస్తాను’ అంటూ ట్విట్ చేశారు. ఇతను మినహా నమ్రతకి సపోర్ట్ ఇస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. మహేష్ అభిమానులు మాత్రమే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోని టైమ్స్ నౌని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.