పవన్ కంటే ముందే నితిన్ వస్తున్నాడు

లాక్‌డౌన్‌లో పెళ్లి పీటలెక్కి మ్యారేజ్ లైఫ్‌ను కూడా మొదలుపెట్టిన టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. ఎప్పుడో షూటింగ్ పూర్తయింది. రిలీజ్ చేయాలని అనుకునేలోపు లాక్‌డౌన్ రావడంతో.. సినిమా విడుదల ఆగిపోయింది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవల థియటర్లు ఓపెన్ కావడంతో.. ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

nithin rang de release
nithin rang de release

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దీనిని తెరకెక్కించారు. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. లాక్‌డౌన్‌లో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని మొదట నిర్మాతలు భావించారు. కానీ ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లకు నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా విడుదల చేస్తే అంత లాభాలు రావని నిర్మాతలు భావిస్తున్నారు.

మార్చి తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఏప్రిల్ 6న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమా విడుదల కానుంది. అంతకంటే రెండు వారాల ముందు మార్చి 26న రంగ్ దే సినిమాను విడుదల చేసే అవకాశముంది.