యదార్ధ సంఘటనల ఆధారంగా నిత్యా 50వ సినిమా

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ ని నమ్మకుండా కేవలం తన యాక్టింగ్ ని మాత్రమే నమ్మి సినిమాలు చేసిన ఈ జనరేషన్ హీరోయిన్స్ లో నిత్య మీనన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సెలెక్టివ్ సినిమాలని మాత్రమే చేస్తున్న నిత్య మీనన్, రీసెంట్ గా మిషన్ మంగళ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ చూపించి మంచి పేరు తెచ్చుకుంది. 1998లో మొదటిసారి తెరపై మెరిసిన నిత్య, ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 49 సినిమాలు చేసింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులని సృష్టించుకున్న ఈ కేరళ కుట్టి, తన 50వ సినిమా పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆరం తిరుకల్పన పేరుతో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని అజయ్ దేవలోక డైరెక్ట్ చేస్తున్నాడు. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.