ETV: ప‌వ‌న్‌క‌ళ్యాన్‌తో పోల్చుతూ నితిన్‌ను ఆడుకున్న సుధీర్‌..

ETV: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ వుంటుంది.. ఆయ‌న‌కు ఫ్యాన్స్ ప్రేక్ష‌కులే కాదు సినీ ప్ర‌ముఖులు కూడా వుంటారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప‌వ‌న్ విష‌యంలో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఆయ‌న వ‌ల్ల‌నే సినీ ఇండ‌స్ట్రీకి వచ్చాన‌ని.. లేకుంటే అమెరికాలో స్థిర‌ప‌డేవాన‌ని గ‌తంలో చెప్పాడు నితిన్‌.. త‌న సినిమాల్లోనే కాదు బ‌య‌ట కూడా నితిన్.. ప‌వ‌న్‌పై త‌న అభిమానిపై చూపుతూ ఉంటారు. కాగా ఇటీవ‌లే ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఈటీవీలో ప్ర‌తి ఆదివారం శ్రీ‌దేవీ డ్రామా కంపెనీ అనే ప్రొగ్రామ్ ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 28న హోళి సంద‌ర్భంగా రంగు ప‌డుద్ది అనే పేరుతో ప్రోగ్రామ్ ప్ర‌సారం కానుంది.

ETV ఈ ప్రొగ్రామ్‌కు వ్యాఖ్యాత‌గా సుధీర్ వ్య‌వ‌హరిస్తుండ‌గా.. ఇందులో నితిన్ పాల్గొన్నాడు.. త‌న ఎంట్రీలోనే ప‌వ‌న్‌క‌ళ్యాన్ స్టెప్పులు వేస్తూ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో స్టెప్పులు వేస్తున్న‌ట్లు అనిపించిందని సుధీర్ అన్నాడు.. దీనికి సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. దీంట్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై స్పెష‌ల్ డ్యాన్స్ చేసిన కొరియోగ్రాఫ‌ర్ జితూ మాస్ట‌ర్‌ను మెచ్చుకుని త‌న త‌ర్వాత సినిమాలో కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్ ఇస్తాన‌ని తెలిపాడు నితిన్‌. దీనిపై సుధీర్ స్పందిస్తూ.. ఇప్పుడు మిమ్మ‌ల్ని చూస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాన్‌గారిని చూస్తున్న‌ట్లు ఉంద‌ని అన్నాడు. ప్ర‌స్తుతం ఈ ETV ప్రోమో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.‌