Tollywood: నితిన్ చెక్ ప్రీరిలీజ్ ఈ వెంట్‌కు వ‌రుణ్‌తేజ్ చీఫ్ గెస్ట్‌..

Tollywood: నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం చెక్‌. ఈ చిత్రాన్ని చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ లాయ‌ర్ పాత్రను పోషిస్తుంది. అలాగే నితిన్‌కు జోడీగా ప్రియా వారియ‌ర్ న‌టిస్తోంది. ఈ సినిమాలో నితిన్ చెస్ ప్లేయ‌ర్‌గా, ఖైదీగా వైవిధ్యభ‌ర‌తమైన పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌,ట్రైల‌ర్ ఆద్యంతం ప్రేక్ష‌కుల‌ను ఆస‌క్తి క‌న‌బ‌ర్చాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో Tollywoodఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 26న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

nithin

దీంతో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ భాగంగా రేపు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు చిత్ర‌యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మానికి మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా రానున్న‌ట్లు ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇక Tollywoodఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంచితే నితిన్ వ‌రుస సినిమాలో ఫుల్ జోష్ మీదున్నాడు.. తాను న‌టిస్తున్న చిత్రాలు సెట్స్‌పై ఉండ‌గానే ఆ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్‌ను రిలీజ్ ఆయా చిత్ర‌బృందాలు. నితిన్‌-కీర్తిసురేశ్ న‌టించిన రంగ్‌దే చిత్రాన్ని మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. అలాగే నితిన్‌, మేర్ల‌పాక గాంధీ కాంబోలో తెర‌కెక్కుతున్న బాలీవుడ్ రీమేక్ మూవీ అంధాదున్ చిత్రాన్ని జూన్ 11న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. Tollywoodఈ చిత్రంలో న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా, మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.