నితిన్,రష్మిక మండన ‘భీష్మ’ ప్రారంభం!

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’ నేటి ఉదయం (12 – 6 – 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యింది.
ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.
ఈ ప్రో జెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,ఎడిటర్ : నవీన్ నూలి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట రత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.