ఈ నెల 16 న గ్రాండ్ గా విడుదల అవుతున్న “నేను c/o నువ్వు’’

ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సహ నిర్మాతలు.ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 16 న  గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సాగారెడ్డి తుమ్మ “నేను c/o నువ్వు’’ చిత్ర విశేషాల గురించి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.మా సినిమా నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.

మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నుండి విడుదలకు ముందుగానే “నేను c/o నువ్వు’’ సినిమా నుండి ఐదు నిమిషాల స్నీక్ పీక్ కంటెంట్ ను విడుదల చేస్తున్నాను. దీన్ని చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.

అలాగే ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో ఉన్న నాలుగు పాటలు కూడా సందర్భానుసారం వస్తాయి. డి ఓ పి జి.కృష్ణ ప్రసాద్ తీసిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ నెల 16 న థి యే టర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “నేను C/o నువ్వు” సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీ నటులు
రత్న కిషోర్,సన్య సిన్హా,సత్య,ధన, గౌతమ్ రాజ్ ,సాగారెడ్డి, తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: అగపే అకాడమీ
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- దర్శక, నిర్మాత : సాగా రెడ్డి తుమ్మ
సహ నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, కె. జోషఫ్
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం, కొరియోగ్రాఫర్: నరేష్
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ, యాక్షన్: షొలిన్ మల్లేష్
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్