నిహారిక పెళ్లి: నాగబాబు ఇస్తున్న కట్నం ఎంతో తెలుసా?

డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరగనున్న మెగా డాటర్ నిహారిక పెళ్లికి ఏర్పాట్లు జరగుతున్నాయి. గుంటూరుకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చైతన్యను నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకోబోతోంది. కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటుండగా.. కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారని తెలుస్తోంది.

మరికొద్దిరోజుల్లో పెళ్లి జరగనున్న క్రమంలో కట్నకానుకలపై జోరుగా చర్చ జరుగుతోంది. తన అల్లుడు చైతన్యకు నాగబాబు రూ.10 కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిహారిక నగల కోసం మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే నిహారిక పేరు మీద ఉన్న బంగ్లాను కూడా అల్లుడికే ఇచ్చేస్తున్నాడట.

ఇప్పటికే నిహారిక ఫ్యామిలీ ఉదయ్‌పూర్ చేరుకుంది. అక్కడ దిగిన ఫొటోలను ఇటీవల నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే నిహారిక ప్రకటించింది. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తానని చెబుతోంది.