నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” చిత్రం పోస్ట్ పోన్

రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే థియేటర్స్ కొరత కారణంగా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా

చిత్ర నిర్మాతలు ముల్లేటి నాగేశ్వ‌రావు, ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు మరియు డాక్టర్, MR Chowdary గారు మాట్లాడుతూ..ఈ ఈ నెల సెప్టెంబర్ 2 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దాం అనుకున్నాము. కాని మేము అనుకున్న theatres మాకు అందుబాటులో లేకపోవడం వల్ల సినిమా నీ వాయిదా వెయ్యడం జరిగింది , ప్రేక్షకులు ఈ సినిమా నీ అభిమానించి మా ట్రెయిలర్ నీ లక్షల సంఖ్యలో లైక్ లు కొట్టిన ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని క్షేమించగలరు , తదుపరి సినిమా రిలీజ్ డేట్ నీ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నాము,
మంచి కంటెంట్ తో ఉన్న మా సినిమా నీ ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారని మంచి theatres లో సినిమా నీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం