ముగ్గురు మొనగాళ్లు కూడా వచ్చేస్తున్నారు

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ముగ్గురు మొనగాళ్లు..!! అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్,  టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డికి వినపడదు.. దీక్షిత్ మాట్లాడలేదు.. రామారావుకి కనపడదు.. ఇలా ముగ్గురు మొనగాళ్లు సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ తో సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టిఎన్ఆర్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో శ్రీనివాస్ రెడ్డి కామెంట్ హైలెట్ గా నిలిచింది.. టీజర్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.. ఆగస్టు 6న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.