గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ సినీ నటి లోక్ సభ సభ్యురాలు ‘నవనీత్ కౌర్’!!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్పూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా నేడు తన నివాసం లో మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి అమరావతి (మహారాష్ట్ర) లోక్ సభ సభ్యురాలు నవనీత్ కౌర్.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని నెలలుగా నేను చూస్తున్నాను త చిత్ర పరిశ్రమకు చెందిన అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరుగుతోందని అని. మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు కావాలని ఉద్దేశంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది అని. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజలలో చైతన్యం తీసుకు వస్తుందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి బృంద సభ్యులకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా మొక్కలు నాటడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి బాధ్యతగా మొక్కలు నాటాలని. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.