విలన్‌ అవతారమెత్తిన స్టార్ నటి

బాలీవుడ్ నటి మౌనీరాయ్ ఇప్పుడు విలన్ అవరాతమెత్తింది. కేజీఎఫ్-1 సినిమాలో గలి గలి మైటమ్ పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆమె.. ఆ ఒక్క పాటలతో క్రేజ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా సింగర్, డ్యాన్సర్‌గా కూడా రాణిస్తోంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు విలన్ అవతారమెత్తింది. రణబీర్ కపూర్,అలియా భట్ ప్రధాన పాత్రలలో వస్తున్న బ్రహ్మస్త సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ సినిమాలో బిగ్‌బి అబితాబ్ బచ్చన్‌తో పాటు టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్రలలో నటిస్తున్నారు.

mouni roy

ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు హిందీ సినిమాల్లో నటించని నాగార్జున.. తొలిసారిగా ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మౌనీరాయ్ నెగిటివ్ రోల్ పోషిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే విలన్ పాత్ర అని తెలుస్తోంది.

కరణ్ జోహర్‌కు సంబంధించిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మౌనీరాయ్ విషయానికొస్తే ఆమె చివరిసారిగా స్పై థ్రిల్లర్ సినిమా లండన్ కాన్ఫిడెన్షియల్‌లో నటించింది. ఇటీవల మాల్థీవుల వెకేషన్లకు వెళ్లి ఈ భామ.. అక్కడ బికినీలలో రెచ్చిపోతోంది. బికినీతో సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఫొటోలు ఇటీవల వైరల్‌గా మారాయి. సినిమా అవకాశాల కోసమే ఆమె ఇలా రెచ్చిపోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి