Manchu Vishnu: మంచు విష్ణు, కాజ‌ల్ న‌టించిన‌ మోస‌గాళ్లు ట్రైల‌ర్ రిలీజ్‌..

Manchu Vishnu: మంచు విష్ణు న‌టిస్తున్న తాజా చిత్రం మోస‌గాళ్లు. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో విష్ణుకు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి పోలీస్ పాత్ర‌ను పోషిస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై.. అమెరికాను వ‌ణికించిన చ‌రిత్ర‌లోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగాManchu Vishnu మోస‌గాళ్లు చిత్రం రూపొందుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్, టైటిల్ థీమ్ మ్యూజిక్‌కు ప్రేక్ష‌కులను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రంకు సంబంధించి ట్రైల‌ర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

డ‌బ్బు సంతోష‌నిస్తుంది అనుకున్నా.. డ‌బ్బు సెక్యురిటీ ఇస్తుంది అనుకున్నా.. ఒట్టేసుకున్న ఈ పేద‌రికం నుంచి దూరంగా వెళ్లిపోవాల‌ని.. అంటూ Manchu Vishnuవిష్ణు చెప్పె డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ ప్రారంభం కాగా.. ఎంతో అల‌రిస్తోంది. అలాగే ల‌క్ష్మీదేవి ఎందుకు అంతా రిచ్ తెలుసా.. నాలుగు చేతుల‌తో సంపాదిస్తుంది కాబ‌ట్టి.. అంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ చెప్పే డైలాగ్ అల‌రిస్తోందిManchu Vishnu. మొత్తానికి ఈ ట్రైల‌ర్ ఎంతో ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.. ఈ చిత్రాన్ని 24ఫిలిం ఫ్యాక్ట‌రీ, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై మంచు Manchu Vishnuవిష్ణు నిర్మిస్తుండ‌గా.. న‌వీన్‌చంద్ర‌, న‌వ‌దీప్‌, ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం అతిత్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలిపారు.