వినాయకచవితి సందర్భంగా మోహన్ బాబు స్పెషల్ స్టోరీ

సీనియర్ టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు వినాయకచవితి సందర్భంగా అభిమానులను సరికొత్తగా ఆకట్టుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా వినాయకచవితి పండగను గతంలో మాదిరిగా జరుపుకునే అవకాశం లేదని ఆయన గతంలో ఎప్పుడు లేని విధంగా అభిమానులకు విగ్నేషుని కథను వినిపించారు.

తనకి ఇష్టమైన పండగాల్లో వినాయకచవితి ఒకటి అని చెబుతూ.. ప్రతి ఏడాది మా ఇంట్లోనే సన్నిహితులను సినీ ప్రముఖులను పిలిచి వినాయకుడి పూజను నిర్వహిస్తుంటాము. నేనే స్వయంగా పూజ చేసి విగ్నేషుని కథను చదివి వినిపిస్తాను. కానీ ఈ సారి అలా చేసుకునే అవకాశం లేదు కాబట్టి యూ ట్యూబ్ ద్వారా తెలుపమని నా తనయుడు విష్ణు సలహా ఇచ్చాడు. అందుకోసమే ఈ విధంగా విగ్నేషుని కథను వినిపిస్తున్నట్లు మోహన్ బాబు ఆ ఆడియోలో తెలియజేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ కథ ప్రతి ఒక్కరి ఇంట్లో పూజలో ఒక భాగం కావాలని కోరుకున్నారు. అభిమానుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.