మోహన్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలైంది.. విడుదల ఎప్పుడంటే?

మంచు మోహన్ బాబు తెలుగు సినిమా ప్రముఖ నటులలో ఒకరు. ఆయన పిల్లలు లక్ష్మి, విష్ణు, మనోజ్ టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ యొక్క వారసత్వాన్ని విభిన్న కోణాల్లో మోస్తున్నారు. నటీనటులుగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా వారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇక సుదీర్ఘ విరామం తరువాత, మోహన్ బాబు తిరిగి సన్ ఆఫ్ ఇండియాతో ఎట్రాక్ట్ చేస్తున్నారు, ఇది పాన్ ఇండియన్ సినిమా అని తెలుస్తోంది. టాలీవుడ్ రైటర్ డైమండ్ రత్నాబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక సినిమా ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది. విష్ణు మంచు ఈ రోజు మొదటి షాట్ దర్శకత్వం వహించారు. అతని భార్య విరానికా మంచు సన్ ఆఫ్ గాడ్ సినిమాకు మోహన్ బాబు యొక్క స్టైలిస్ట్ గా వర్క్ చేయనున్నారు. ప్రముఖ సంగీత కంపోజర్ ఇలయరాజా ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రల కోసం పలువురు బాలీవుడ్ నటులతో చర్చలు జరుపుతున్నారు. సన్ ఆఫ్ ఇండియాకు మోహన్ బాబు స్వయంగా స్క్రీన్ ప్లే రాశారు మరియు ప్రీ-ప్రొడక్షన్ పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఈ సినిమాకు విష్ణు మంచుతో పాటు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.