కుటుంబం కన్నా ఆనందం మరొకటి ఉండదు: ‘మెగాస్టార్’

కరోనా సంక్షోభం ప్రతి ఒక్కరి జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు ప్రతి పరిశ్రమ చెడు ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవలి మీడియా సంభాషణలో, మెగాస్టార్ చిరంజీవి, అదా శర్మ, సుధీర్ బాబు మరియు శ్రియ శరణ్ ప్రస్తుత పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారనే దానిపై తమ ఆలోచనలను పంచుకున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ “నటన, రాజకీయ సంబంధిత పనులు నన్ను ఎప్పుడూ బిజీగా ఉంచుతాయి. కాని, మహమ్మారి కుటుంబ సభ్యులకు నా గరిష్ట సమయాన్ని ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చింది. నా అభిప్రాయం ప్రకారం, కుటుంబ సబ్యులతో ఉండడం వల్ల వచ్చే ఆనందం స్థాయికి ఏదీ సరిపోదు. అమ్మ కోసం వంట చేసి తినిపించినపుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది అని మెగాస్టార్ అన్నారు.
వివాహం తరువాత, నటి శ్రియా శరణ్ భర్తతో కలిసి బార్సిలోనాకు వెళ్లిన విషయం తెలిసిందే. చిరంజీవి మాదిరిగానే, ఆమె కూడా ఫ్యామిలీతో బ్రేక్ ని చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పారు. ఇక శ్రుతి హాసన్ లాక్డౌన్ మొదలైప్పటి నుండి ఆమె ఒంటరిగా ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో నటి ఎక్కువగా వంట, రన్నింగ్, కంపోజింగ్, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టింది.