ఆచార్య తరువాత మెగాస్టార్ మాస్టర్ ప్లాన్

మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న తన 65వ పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజు ఆయన భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి వివరణ ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ వయసులో కూడా మెగాస్టార్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి సిద్ద పడుతున్నారు. ఇక బర్త్ డే రోజు రెండు కొత్త ప్రాజెక్టులను ఎనౌన్స్ చేయబోతున్నారు.

నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ అయిపోతే ఒకేసారి రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. జై లవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో కొత్త కథపై చర్చలు జరువుతున్న మెగాస్టార్ అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్ లో తమిళ్ సినిమా వేదళంను రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని ఒకేసారి పట్టాలెక్కించాలని మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ బర్త్ డే రోజు వచ్చే అవకాశం ఉంది. మరి మెగాస్టార్ ఇచ్చే సర్ ప్రైజ్ అభిమానులను ఎంతవరకు కిక్కిస్తుందో చూడాలి.