మెగాస్టార్ మాస్క్ సందేశం.. వీడియో వైరల్

సందేశాలు ఇవ్వడంలో తన స్టైలే వేరని మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి నిరూపించారు. కరోనా వైరస్ తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో తనదైన శైలిలో హీరోయిన్ ఈషా రెబ్బతో కలిసి జనాలకు మాస్క్ సందేశాన్ని ఇచ్చారు. మొహానికి చిరునవ్వు ఎంత అవసరమో అలాగే ఇప్పుడున్న పరిస్థితులల్లో మాస్క్ కూడా అంతే అవసరమని చెబుతూ జనాలను ఆలోచించేలా వీడియో రూపొందించారు.

దీంతో ఆ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా మెగాస్టార్ సమాజానికి ఉపయోగపడేలా ఎన్నో ఉదాహరణలతో జనాలను ఆకర్షించారు. ఇక ఇప్పుడు కోవిడ్ -19 తీవ్రంగా పెరుగుతున్న సమయంలో రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ కి జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.