పేదింటి అభిమాని కుమార్తె ‘పెళ్ళికి’ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించిన ”మెగాస్టార్ చిరంజీవి”!!

మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా, రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్ కీ ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. వీళ్ళ పేదరికాన్ని స్వయంగా చిరంజీవి తెలుసుకొని వాళ్ళ పెద్దమ్మాయి( వర్ష) ఈ నెల డిసెంబర్ 19 న జరిగే పెళ్లికి 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతు మెగాస్టార్ చిరంజీవి గారు లక్ష రూపాయల సహాయం చేయడం సంతోష కరమైన విషయం అని , చిరంజీవి గారిని ఆ దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే అన్నారు, రవణం స్వామినాయుడు మాట్లాడుతు అభిమానులు ఎవరూ కష్టాల్లో ఉన్న మాకు చెప్పండి అని చిరంజీవి గారే స్వయంగా మాతో చెప్పినట్టు స్వామి నాయుడు చెప్పారు, నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతు “రక్త సంబంధీకులు చేయని సహాయం చిరు గారూ చేసారు ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేనిది అని కన్నీళ్ల పర్యంతమయ్యారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు ,సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునిర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎతున్న పాల్గొన్నారు.