ఫైనల్ నేరేషన్ అయ్యింది… పోలిస్ గా మెగాపవర్ స్టార్

ఇండియన్-2 వివాదం సమసిపోవడంతో డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూవీ గురించి డిస్కషన్ మొదలయ్యింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అయిపోవస్తూ ఉండడం, ఇండియన్ 2 అడ్డంకులు తొలగిపోవడం లాంటి కారణాలు కలిసి రావడంతో డీల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడెప్పుడు మొదలుపెట్టాలా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయం చర్చించడానికి రామ్ చరణ్‌, దిల్ రాజు, శంకర్ లు చెన్నైలో మీట్ అయ్యారు. నిన్న జరిగిన ఈ మీటింగ్ లో చరణ్ స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ కూడా విన్నాడట. పోలిస్ కథతో శంకర్ సినిమా తాలూకు ఎలిమెంట్స్ ఉండేలా రెడీ చేసిన ఈ సినిమా వచ్చే నెల నుంచే మొదలుపెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ టీం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల్లోనే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు, షూటింగ్ అప్‌డేట్‌తో ఒక ప్రకటన ఇవ్వబోతున్నారని సమాచారం. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్తారా లేక టైటిల్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ విదేశీ భామకు కూడా ఇందులో కీలక పాత్ర ఉందని అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత బాధ్యతలు తీసుకుంటున్నాడు.