
రెండు రోజుల క్రితం నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో చదువుతున్న స్కూల్లో ఒక అగ్ని ప్రమాదం వల్ల గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించగా అటు రాజకీయ నాయకుల నుండి ఇటు చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది స్పందించారు. ఆ సంఘటన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ఆయన భార్య సురేఖ గారు సింగపూర్ కు వెళ్లడం జరిగింది. కాగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సోషల్ మీడియా ద్వారా మార్క్ శంకర్ ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి పై ఈ విధంగా అప్డేట్ ఇవ్వడం జరిగింది.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టిన మెగాస్టార్ చిరంజీవి.