
దర్శకనటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతి గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డైరెక్టర్ హిమాయం అని కూడా అతడిని సన్నిహితులు పిలుస్తారు. అతడు ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మనోజ్ భారతి కొన్ని చిత్రాలలో నటించారు. తాజ్ మహల్ సినిమా ద్వారా హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మనోజ్ సముద్రమ్, కదల్ పూక్కల్, పల్లవన్, మానాడు, విరుమాన్ వంటి చిత్రాల్లో నటించారు. మనోజ్ ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు.