Maheshbabu: దుబాయ్‌కి ఫ్యామిలీతో మ‌హేశ్‌బాబు.. కార‌ణం ఏంటో తెలుసా!

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీత గోవిందం ఫేం ప‌రుశురాం డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న తొలిసారిగా కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్‌ను దుబాయ్‌లో నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేశారు. మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ అక్క‌డ మొద‌ల‌వుతుంది. సుమారు నెల రోజుల భారీ షెడ్యూలును దుబాయ్‌లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

maheshbabu

ఈ నేప‌థ్యంలోనే గురువారం మ‌హేశ్ త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దుబాయ్‌కి బ‌య‌లుదేరారు. శుక్ర‌వారం మ‌హేశ్‌బాబు భార్య న‌మ్ర‌త పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్క‌డ‌నే సెలబ్రేట్ చేసుకుంటారు. అనంత‌రం ఈ సినిమా షూటింగ్‌లో Maheshbabu మ‌హేశ్ జాయిన్ అవుతార‌ని, కుటుంబ‌స‌భ్యులు తిరిగి ఇండియాకు వ‌చ్చేస్తార‌ని స‌మాచారం. ఈ మేర‌కు మ‌హేశ్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.