Maheshbabu: “స‌ర్కార్ వారి పాట” షూటింగ్ లొకేష‌న్‌లో మ‌హేశ్ ఫోటో లీక్

Maheshbabu: టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు తాజాగా స‌ర్కార్ వారి పాట చిత్రం లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీత‌గోవిందం డైరెక్ట‌ర్ ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే దుబాయ్‌లో ప్రారంభ‌మైంది.

Maheshbabu

ఈ క్ర‌మంలో తాజాగా సెట్స్ నుంచి మ‌హేశ్‌బాబు Maheshbabu ఫోటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ఫోటోలో మ‌హేశ్‌బాబు కు అసిస్టెంట్ గొడుగు ప‌ట్టి నిల‌బ‌డ‌గా.. డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కింద కూర్చొని ఉన్నాడు. అయితే ఈ ఫోటోలో డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ నేల మీద కూర్చుండిపోయాడు. అస‌లే దుబాయ్‌లో విప‌రీత‌మైన ఎండ‌లు ఉంటాయి… ఇలా ఎర్ర‌టి ఎండ‌లోనే నేల మీద కూర్చున్న ప‌రుశురామ్‌ను చూసి నెటిజ‌న్లు… ప‌ని మీద‌, వృత్తి ప‌ట్ల ఎంత శ్ర‌ద్ధ‌, ఎంత నిబ‌ద్ధ‌త అని కొనియాడుతున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్‌.ఎస్. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌లే త‌మ‌న్ స‌ర్కార్ వారి పాట కోసం దుబాయ్ వెళ్లాడు.