Bollywood: మ‌హేశ్ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..

Bollywood: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ప‌రుశురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంత‌రం మ‌హేశ్ బాలీవుడ్ చిత్రాన్ని ఓకే చేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం రామాయ‌ణం క‌థాంశంతో రూపొందుతుంద‌ట‌.. ఈ చిత్రాన్ని హిందీతో పాటు ప‌లు భాష‌ల్లో తెర‌కెక్కే చిత్రానికి దంగ‌ల్ ఫేం డైరెక్ట‌ర్ నితీశ్ తివారీ, మామ్ ఫేం డైరెక్ట‌ర్ ర‌వి ఉడ‌యార్ సంయుక్తంగా ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు.

Superstar

ఇక ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అర‌వింద్‌తో పాటు నిర్మాత మ‌ధు వంతెన సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని నిర్మించాల‌ని వీరు ఎప్ప‌టినుంచో ప్ర‌యత్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌లే ఈ సినిమా ప‌నులు మొద‌ల‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ చిత్రంలో శ్రీ‌రాముడిగా మ‌హేశ్ బాబు, సీత‌గా దీపికా ప‌దుకుణే, రావ‌ణుడిగా హృతిక్ రోష‌న్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.