నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించే కాంబినేషన్ ఇది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ మేజర్ అజయ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ అయ్యాక మహేశ్, వంశీ పైడిపల్లి కొరటాల శివ త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగ పరశురామ్ లతో సినిమాలు చేస్తాడనే వార్తలు వినిపించాయి కానీ వాళ్లందరినీ పక్కకి నెడుతూ కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ లైన్ లోకి వచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇటీవలే ప్రశాంత్ నీల్, మహేశ్ బాబుని కలిసి మూడు గంటలపాటు ఒక కథ చెప్పాడని, ఆ కథ నచ్చడంతో మహేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి అయ్యాక ప్రశాంత్ నీల్, ఈ మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేశ్ బాబు నటించబోయే సినిమా ఇదే అవుతుందట. పాన్ ఇండియా కథతో మహేశ్ అండ్ ప్రశాంత్ నీల్ రాబోతున్నారని ఘట్టమనేని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికైతే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఈ వార్త రూమర్ గా మాత్రమే మిగిలింది కానీ ఒక్కసారి సెట్ అయితే మాత్రమే ప్రకటనతో నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించగలిగే కాంబినేషన్ ఇది.