ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాకి లెజెండరీ మెంటర్

పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తూ వైజయంతీ మూవీ మేకర్స్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జట్, భారీ స్టార్ కాస్ట్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ అంతా కలిసి ప్రభాస్ మూవీని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రెడీ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తుంటే క్రిటివిటీ చూపించే దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు గారు ఈ మూవీకి మెంటర్ గా వ్యవహరిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి ఎక్స్పరిమెంటల్ క్లాసిక్ సినిమాలని తీసిన సింగీతం శ్రీనివాస రావు గారు ప్రభాస్ అండ్ టీంతో జాయిన్ అవ్వడం, సినిమాకి ఎంతో హెల్ప్ అవనుంది. అయితే ప్రభాస్ మూవీకి సీనియర్ డైరెక్టర్ మెంటర్ గా వర్క్ చేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో జక్కన్న చెక్కిన మహాకావ్యం బాహుబలి సినిమాకి కూడా లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు మెంటర్ గా ఉన్నారు. ఆ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మరి అంతకు మించిన రిజల్ట్ ని ప్రభాస్ నాగ్ అశ్విన్ ఇస్తారేమో చూడాలి.